నాగ్ తో వెంకి మల్టీ స్టారర్ మూవీ
తెలుగులో
మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతుంది. ఈ ట్రెండ్ ఆరంభమైంది విక్టరి వెంకటేశ్
కారణంగానే. ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె
చెట్టు', రామ్ తో కలిసి 'మసాలా',
పవన్ కల్యాణ్ తో కలిసి 'గోపాల గోపాల' చిత్రాల్లో నటించాడు వెంకి . తాజాగా మరో మల్టీస్టారర్ కి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. నాగార్జున కాంబినేషన్లో వెంకి ఓ చిత్రంలో కలిసి నటిస్తాడనే వార్త ఫిల్మ్ నగర్ లో గుస గుస . అఖిల్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమాకి దర్శకత్వం
వహిస్తున్న వి.వి. వినాయక్ ఓ మంచి కమర్షియల్ స్టోరీ రెడీ చేశాడట. ఈ కథలో వెంకటేష్,
నాగర్జున కలిసి నటిస్తే బాగుంటుందని దానికి సంబందించిన కథ వెంకీ,
నాగ్ లకు ఈ చెప్పాడట వినాయక్. ఇద్దరికీ ఈ కథ నచ్చిందని దాంతో ఈ సినిమాలో
నటించడానికి వెంకీ, నాగ్
లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
0 comments:
Post a Comment